ఈ నెల 24న దివ్యాంగులు, వృద్ధులకు దర్శన టికెట్లు విడుదల చేయనున్న టీటీడీ

  • ఉదయం 10 గంటలకు ఆన్ లైన్లో టికెట్లు
  • అధికారిక వెబ్ సైట్లో బుక్ చేసుకోవాలన్న టీటీడీ
  • నకిలీ వెబ్ సైట్లతో జాగ్రత్త అంటూ హెచ్చరిక
తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టికెట్లను ఈ నెల 24న ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేయనున్నట్టు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 

భక్తులు అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని తెలిపింది. నకిలీ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని స్పష్టం చేసింది. కాగా, ప్రతి నెలలోనూ రెండు రోజులు దివ్యాంగులు, ఐదేళ్ల లోపు పసిబిడ్డల తల్లిదండ్రులు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు టీటీడీ తిరుమల వెంకన్న దర్శన భాగ్యం కలుగజేస్తోంది.

TTD
Darshan Tickets
Old People
Handicapped
Tirumala

More Telugu News